దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 26.55 కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లపైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 17, గురువారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 26.55 కోట్లు (26,55,19,251) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వివరాలు (జూన్ 17, ఉదయం 7 గంటల వరకు):
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,00,88,081
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 70,17,838
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 1,69,56,515
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 89,36,711
- 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 4,73,43,608
- 18-44 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 9,69,085
- 45-60 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 7,79,22,224
- 45-60 ఏళ్ల వయసు వారు (రెండో డోసు): 1,22,96,349
- 60 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 6,35,37,652
- 60 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 2,04,51,188
- మొత్తం అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 26,55,19,251
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ