మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసమైన ‘మాతోశ్రీ’ వద్ద విధులు నిర్వహించే భద్రతా సిబ్బందిలోని ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. దీంతో ఈ ముగ్గురిని ఆసుపత్రికి, వారి కుటుంబసభ్యులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. సీఎం నివాసం వద్ద కరోనా వెలుగు చూడడంతో అప్రమత్తమైన అధికారులు నియంత్రణ చర్యలకు దిగారు. ఈ ముగ్గురితో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న వ్యక్తులను గుర్తించి వారికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు మహారాష్ట్ర రాష్ట్రంలో మే 2, శనివారం ఉదయానికి 11,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,506 కేసులు నమోదవగా, ఒక్క ముంబయి నగరంలోనే 7,812 నమోదయ్యాయి. వీరిలో 1879 మంది కోలుకోని డిశ్చార్జ్ అవ్వగా, 485 మంది మృతిచెందారు. దేశంలో నమోదైన కరోనా మరణాల్లో అటుఇటుగా సగం మహారాష్ట్రలోనే నమోదు కావడం విశేషం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu