దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ తమ తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ను తక్షణమే డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం కోరింది. కీలక సమాచారాన్ని ఇచ్చే ఈ ఆరోగ్యసేతు యాప్ ను ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటుగా ప్రజలందరూ తప్పనిసరిగా వాడాలని కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రవేశపెట్టిన ఈ యాప్ వలన కంటైన్మెంట్ జోన్లలో ఉన్నవారికి కాంటాక్ట్ ట్రేసింగ్ నుంచి రక్షణ పొందే సూచనలు ఉంటాయని, ప్రజలంతా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అందుకోసం అధికారులు ప్రజలకు సహకరించాలని సూచించింది.
ప్రస్తుతం ఈ యాప్ను దేశవ్యాప్తంగా ఏడున్నర కోట్ల మంది వాడుతున్నారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ యాప్ ను గూగుల్ యాప్ స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. సోషల్ మీడియా ద్వారా లేదా ఇతరుల ద్వారా ఆరోగ్యసేతు యాప్ పేరుతో వచ్చే ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవద్దని, ఆ ఫైల్స్ వైరస్/ మాల్వేర్ కలిగిఉండే అవకాశముందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu