దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 400 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 347 పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 25, శుక్రవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,70,830కు, మరణాల సంఖ్య 5,30,604కి పెరిగింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 2,67,170 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.13 శాతంగా నమోదైంది.
అలాగే మరో 709 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,34,710 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 5,516 (0.01%) మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE