దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 37,593 కేసులు, 648 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,12,366 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,35,758 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మిజోరాం, ఒడిశా, వెస్ట్ బెంగాల్, అస్సాం, తెలంగాణ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 34,169 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,17,54,281 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.67 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది. దేశంలో ప్రస్తుతం 3,22,327 (0.99) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (ఆగస్టు 24 (8am)–ఆగస్టు 25 (8am)):
- కేరళ – 24296
- మహారాష్ట్ర – 4355
- తమిళనాడు – 1585
- కర్ణాటక – 1259
- ఆంధ్రప్రదేశ్ – 1248
- మిజోరాం – 845
- ఒడిశా – 625
- వెస్ట్ బెంగాల్ – 613
- అస్సాం – 555
- తెలంగాణ – 389
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ