భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. రేపు తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహ ప్రయోగం చేయనునుంది. దీనికోసం ‘ఇస్రో’ శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్డౌన్ను ప్రారంభించింది. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ధృవీకరించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహ వాహక నౌకను నిర్దేశిత కక్ష్య లోకి పంపడానికి సన్నాహాలు పూర్తి చేశామని, 25:30 గంటల కౌంట్డౌన్ కొనసాగిన తర్వాత శనివారం ఉదయం 11.56 గంటలకు పీఎస్ఎల్వీ సీ54 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుందని ఆయన ప్రకటించారు. ఇక పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్లో ఇది 56వ ప్రయోగమని, అలాగే ఈ ఏడాదిలో ఇదే చివరి ప్రయోగమని కూడా ఆయన తెలిపారు. ఈ పీఎస్ఎల్వీ సీ-54 శాటిలైట్ ద్వారా 9 ఉపగ్రహాలను నింగిలోకి పంపుతున్నామని, కౌంట్డౌన్ ప్రారంభించాక రాకెట్ రెండో దశ మరియు నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపడుతున్నామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE