భారత్ లో రోజువారీ కరోనా పాజీటివిటీ రేటు, యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారీ పాజీటివిటీ రేటు (1.94%) ఉండగా, వరుసగా 24 రోజులుగా 3 శాతం కన్నా తక్కువగా నమోదవుతుంది. అలాగే యాక్టీవ్ కేసులు (3,64,129) గత 149 రోజుల్లోనే తక్కువకు చేరాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 36,401 పాజిటివ్ కేసులు నమోదవగా, 530 మంది మరణించారు. దీంతో ఆగస్టు 19, గురువారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,23,22,258 కు, మరణాల సంఖ్య 4,33,049 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
గత 24 గంటల వ్యవధిలో 39,157 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 3,15,25,080 కు చేరుకుంది. ఇక కరోనా రికవరీ రేటు 97.53 శాతం గానూ, మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 3,64,129 (1.13%) మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ