దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా 6 రోజులుగా 50 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, 97 రోజుల తర్వాత దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 5 లక్షల కంటే తక్కువుకు చేరుకుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 44,111 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,02,362 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 738 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,01,050 కి పెరిగింది. ప్రస్తుతం 4,95,533 (1.62%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా కేరళ (12,095), మహారాష్ట్ర (8,753), తమిళనాడు (4,230), ఆంధ్రప్రదేశ్ (3,464), ఒడిశా (3,222), కర్ణాటక (2,984), అస్సాం (2,453), వెస్ట్ బెంగాల్ (1,422), తెలంగాణ (858), ఛత్తీస్ గడ్ (305) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 57,477 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 2,96,05,779 కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ