దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తుంది. ఆ రాష్ట్రంలో జూన్ 17, బుధవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,16,752 కి చేరింది. రాష్ట్రంలో ఈ వైరస్ వల్ల ఇప్పటికి 5,651 మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3820 మంది పోలీసులకు కూడా కరోనా వైరస్ సోకిందని ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఈ రోజు ట్విట్టర్ లో వెల్లడించారు. కాగా ఇందులో 2754 మంది పూర్తిగా కోలుకున్నారని, 45 మంది పోలీసులు మరణించారని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 6,10,281 మందిని క్వారంటైన్ చేయగా, 734 మంది క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 122 సహాయ శిబిరాలను నిర్వహించి, అక్కడ 4,138 మంది వలస కూలీలకు ఆహారం, ఇతర సదుపాయాలతో ఆశ్రయం కల్పించినట్టు పేర్కొన్నారు.
1,335 offences have been registered for illegal transport.
3,820 police personnel have tested positive for Covid-19. Of these 2,754 have recovered & 45 have tragically succumbed.
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) June 18, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu