తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 18, గురువారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా ఇంటర్ మొదటి సంవత్సరంలో 2.88 లక్షల మంది, రెండవ సంవత్సరంలో 2.83 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొదటి సంవత్సర ఫలితాల్లో 67.4 శాతంతో, రెండవ సంవత్సరంలో 71.15 శాతంతో బాలికలు ఉత్తీర్ణత సాధించి ఫలితాల్లో పైచేయి సాధించారు. ఇక మొదటి సంవత్సరంలో 52.30 శాతం, రెండవ సంవత్సరంలో 62.10 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్ సైట్స్:
- https://tsbie.cgg.gov.in2
- http://examresults.ts.nic.in
- http://results.cgg.gov.in
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu