దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 16, గురువారం నాడు కొత్తగా 4549 కరోనా పాజిటివ్ కేసులు, 69 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,56,369 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 82128 కేసులు నిర్ధారణ అయ్యాయి.
గత 24 గంటల్లో నమోదైన 69 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు తమిళనాడులో మరణించిన వారి సంఖ్య 2236 కి చేరింది. కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 5106 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,07,416 కి చేరింది. ప్రస్తుతం 46714 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. మరోవైపు జూలై 16 నాటికీ 17,82,635 కరోనా పరీక్షలను నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu