ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 21, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,53,268 కు చేరుకుంది. గత 24 గంటల్లో 44,516 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా, 13,212 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా విశాఖపట్నం జిల్లాలో 2244, చిత్తూరు జిల్లాలో 1585, అనంతపూర్ జిల్లాలో 1235, శ్రీకాకుళం జిల్లాలో 1230, గుంటూరు జిల్లాలో 1054, నెల్లూరు జిల్లాలో 1051, కర్నూల్ జిల్లాలో 961, తూర్పుగోదావరి జిల్లాలో 816, ప్రకాశం జిల్లాలో 772, విజయనగరంలో 681, కడప జిల్లాలో 649, పశ్చిమగోదావరిలో 596, కృష్ణా జిల్లాలో 338 కేసులు నమోదయ్యాయి.
ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో ఐదుగురు మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 14532 గా ఉంది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 2,942 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 20,74,600 కు చేరింది. అలాగే ప్రస్తుతం 64,136 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక జనవరి 21 నాటికీ ఏపీలో మొత్తం 3,20,56,618 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF