దేశంలో మే 25 వ తేదీ నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులు కలిగిన రాష్ట్రాలైన మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్ నుంచి వచ్చే విమాన ప్రయాణికులు తప్పనిసరిగా 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ లో ఉండాల్సిందేనని ప్రకటించారు. ఆ ప్రయాణికులకు కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వస్తే మరో ఏడు రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షించనున్నట్టు తెలిపారు.
ఇక కరోనా ప్రాబల్యం ఉన్న ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికీ 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ నిబంధనను అనుసరించాలని చెప్పారు. పలు ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు ప్రవేశించడానికి రూపొందించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్ఓపి) ప్రకారం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu