దేశంలో బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97,35,850 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,41,360 కి పెరిగింది. గత కొన్నిరోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 32,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం 36,635 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. మరోవైపు కొత్తగా నమోదయిన కేసులలో దేశంలోని కేవలం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుండే 75.11 శాతం నమోదయ్యాయి.
కొత్త కేసుల్లో 75 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- కేరళ – 5032
- మహారాష్ట్ర – 4026
- ఢిల్లీ – 3188
- వెస్ట్ బెంగాల్ – 2941
- ఉత్తరప్రదేశ్ – 1776
- రాజస్థాన్ – 1604
- ఛత్తీస్ గడ్ – 1467
- హర్యానా – 1391
- మధ్యప్రదేశ్ – 1345
- గుజరాత్ – 1325
మరోవైపు గత 24 గంటల్లో 402 మరణాలు నమోదవగా దేశంలోని 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే 76.37 శాతం నమోదయ్యాయి.
402 మరణాల్లో 76 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- ఢిల్లీ – 57
- మహారాష్ట్ర – 53
- వెస్ట్ బెంగాల్ – 49
- కేరళ – 31
- పంజాబ్ – 30
- ఉత్తరప్రదేశ్ – 23
- రాజస్థాన్ – 20
- ఛత్తీస్ గడ్ – 15
- గుజరాత్ – 15
- హిమాచల్ ప్రదేశ్ – 14
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ