అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడంలో భాగంగా ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో బుధవారం నాడు శంకుస్థాపన చేశారు. అలాగే చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంవద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను కూడా సీఎం ఆవిష్కరించారు.
ముందుగా హంద్రీనీవా నుంచి అప్పర్ పెన్నార్ డ్యాం(పేరూరు డ్యాం) కు నీటి తరలింపు కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లు నిర్మాణంతో రాప్తాడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని 35 గ్రామాలకు సంబంధించి లక్ష ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఇన్ ఛార్జ్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు ఎం.శంకరనారాయణ, సీదిరి అప్పలరాజు, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డితో పాటుగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ