తెలంగాణ రాష్ట్రంలో మరో 1802 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 6, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,42,771 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 895 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.62 (< 1%) శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 2711 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,10,241 కి చేరింది. ప్రస్తుతం 31,635 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 77.2 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 245, రంగారెడ్డిలో 158, కరీంనగర్ లో 136, సిద్దిపేటలో 106, సంగారెడ్డిలో 103, నిజామాబాద్ లో 94, వరంగల్ అర్బన్ లో 93, నల్గొండలో 79, జగిత్యాలలో 73, మేడ్చల్ లో 65, ఖమ్మంలో 64, మహబూబాబాద్ లో 63, సూర్యాపేటలో 62 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu