ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 113, తూర్పుగోదావరిలో 72, కృష్ణాలో 55, విశాఖపట్నంలో 36 నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 19, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,15,950 కు, మరణాల సంఖ్య 14710 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,486 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 22,93,882 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,358 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(425):
- పశ్చిమగోదావరి – 113
- తూర్పుగోదావరి – 72
- కృష్ణా – 55
- విశాఖపట్నం – 36
- గుంటూరు – 34
- ప్రకాశం – 34
- చిత్తూరు – 24
- అనంతపురం – 20
- కడప – 12
- విజయనగరం – 12
- నెల్లూరు – 11
- కర్నూల్ – 1
- శ్రీకాకుళం – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ