దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 9,531 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,48,960 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 36 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,27,368 కి పెరిగింది. దీంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 97 వేలుకుపైగా (97,648 (0.22%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా గత 24 గంటల్లో మహారాష్ట్ర (1832), కేరళ (1089), ఢిల్లీ (942), కర్ణాటక (720), ఉత్తరప్రదేశ్ (682), తమిళనాడు (603), హర్యానా (595), రాజస్థాన్ (402), వెస్ట్ బెంగాల్ (296), ఒడిశా (287), జమ్మూ అండ్ కాశ్మీర్ (276), తెలంగాణ (252) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి.
అలాగే కొత్తగా 11,726 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,37,23,944 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.59 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఆగస్టు 22, సోమవారం ఉదయం 7 గంటల వరకు 210.02 కోట్లకుపైగా (2,10,02,40,361) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 35,33,466 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY