తెలంగాణ పాలిటిక్స్లో ఆదివారం చోటుచేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. చెప్పులు అందిస్తున్నట్లున్న వీడియోపై వివాదం నెలకొంది. ఆదివారం మునుగోడు పర్యటన సందర్భంగా అమిత్ షా తొలుత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో దర్శనం అనంతరం ఆయన బయటకు రాగా.. ముందున్న బండి సంజయ్ ఆయనకు చెప్పులు అందించారని చెప్తూ ఒక వీడియోను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు.
ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది.
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది.
జై తెలంగాణ! https://t.co/SpFCHAszYe
— KTR (@KTRTRS) August 22, 2022
ఈ మేరకు మంత్రి కేటీఆర్ దీనిపై స్పందిస్తూ.. ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను-ఢిల్లీ నాయకులకి చుక్కలు చూపిస్తున్న నాయకుడిని తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY