ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. “అందరికీ హాయ్, ఈ రోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జాగ్రత్త చర్యల్లో భాగంగా నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. అలాగే అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను. కానీ మీరు బాధపడకండి. ఇది మీ సమస్యలను పరిష్కరించడానికి నాకు తగినంత సమయం ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను మీ అందరి కోసం ఎల్లప్పుడూ ఉంటాను” అని సోనూసూద్ పేర్కొన్నారు.
దేశంలో కరోనా వెలుగులోకి వచ్చాక గతేడాది లాక్డౌన్ సమయంలో సొంత ఖర్చులతో వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు దేశానికి వచ్చేందుకు సహాయం చేయడం, అంతే కాకుండా తనదృష్టికి వచ్చిన ఎన్నో అంశాలలో ప్రజలకు సహాయం చేసిన సోనూసూద్ రియల్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సోనూసూద్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. మరోవైపు దేశంలో ఇటీవల పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనాబారిన పడ్డారు. కరోనా పాజిటివ్ గా తేలిన వారిలో అక్షయ్ కుమార్, విక్కీ కౌశల్, రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, కత్రినా కైఫ్, అమీర్ ఖాన్, మనోజ్ బాజిపేయి, మాధవన్, కార్తీక్ ఆర్యన్ వంటివారు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ