తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సెప్టెంబర్ 22, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,77,070 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1062 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.
ఇక కరోనా నుంచి కొత్తగా 2062 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,46,135 కి చేరింది. ప్రస్తుతం 29,873 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 82.52 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 321, రంగారెడ్డి జిల్లాలో 217, మేడ్చల్ లో 173, నల్గొండలో 155, కరీంనగర్ లో 136, వరంగల్ అర్బన్ లో 99, సిద్దిపేటలో 92, నిజామాబాద్ లో 82, సంగారెడ్డిలో 81, కామారెడ్డిలో 77, భద్రాద్రి కొత్తగూడెంలో 77, మహబూబాబాద్ లో 72, ఖమ్మంలో 69 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu