కోవిడ్ -19 (కరోనా వైరస్) కట్టడి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చ్ 24 , మంగళవారం నాడు రాజ్యసభ ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తునట్టు ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని పది రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అవ్వగా, ఇక మిగిలిన 18 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ 18 సీట్లకు సంబంధించి నామినేషన్లు పరిశీలన కూడా పూర్తయింది. మార్చ్ 26 వ తేదీన ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే త్వరలోనే తదుపరి పోలింగ్, కౌంటింగ్ తేదీలను ప్రకటించనున్నట్లు సీఈసీ వెల్లడించింది.
Home జాతీయం/అంతర్జాతీయం
- Advertisement -