భారతదేశ నావికాదళ నూతన అధిపతిగా అడ్మిరల్ ఆర్ హరికుమార్ మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గత ఛీప్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ పదవీ విరమణ చేయడంతో నావికాదళ అధిపతిగా హరి కుమార్ నియమితులయ్యారు. ఈ రోజు ఢిల్లీలో అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుంచి హరికుమార్ బాధ్యతలు స్వీకరించారు. అడ్మిరల్ హరి కుమార్ ఇంతకుముందు పశ్చిమ నౌకాదళ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా పనిచేశారు. నేవీలో దాదాపు 39 సంవత్సరాల పాటుగా ఆయన వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. అలాగే నౌకాదళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ నిషాంక్, ఐఎన్ఎస్ కోరా, గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రణవీర్ లకు హరికుమార్ నాయకత్వం వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ