దేశంలో సాయుధ దళాల రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై గత రెండ్రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీహార్, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తాజాగా ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 10% రిజర్వేషన్లు ప్రకటించింది. సీఏఫీఎఫ్లు మరియు అస్సాం రైఫిల్స్లో రిక్రూట్మెంట్ కోసం అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.
“సీఏఫీఎఫ్లు మరియు అస్సాం రైఫిల్స్కు రిక్రూట్మెంట్లో అగ్నిపథ్ పథకం కింద 4 సంవత్సరాలు పూర్తి చేసిన అగ్నివీరులకు 10% ఖాళీలను రిజర్వ్ చేయడానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు సీఏఫీఎఫ్లు మరియు అస్సాం రైఫిల్స్లో రిక్రూట్మెంట్ కోసం అగ్నివీరులకు సూచించిన గరిష్ట ప్రవేశ వయోపరిమితిలో 3 సంవత్సరాల సడలింపు ఇవ్వాలని హోం శాఖ నిర్ణయించింది. అలాగే అగ్నిపథ్ పథకం మొదటి బ్యాచ్ కోసం ఈ వయోపరిమితి సడలింపు 5 సంవత్సరాలు ఉంటుంది” అని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY