తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతుంది. కొత్తగా 279 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 17, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,95,572 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 119 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,89,680 కి చేరింది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.26 శాతంగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1781 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ లో 172, రంగారెడ్డిలో 62, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 20, మంచిర్యాలలో 5, కరీంనగర్ లో 4, సూర్యాపేటలో 2, నిజామాబాద్ లో 2, నల్గొండలో 2, మెదక్ లో 2, ఖమ్మంలో 2, భద్రాద్రి కొత్తగూడెంలో 1, జయశంకర్ భూపాలపల్లిలో 1, కొమురం భీం ఆసిఫాబాద్ లో 1, మహబూబ్ నగర్ లో 1, హనుమకొండలో 1, సంగారెడ్డిలో 1 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY