ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పులు చేసింది. ఫోర్స్లో చేరాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు ముందుగా ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ)కి హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఫిజికల్ ఫిట్నెస్ మరియు మెడికల్ టెస్ట్లను ఎదుర్కోవాలి. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ శనివారం రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పును ప్రకటించింది. దీనిప్రకారం.. అభ్యర్థులు నామినేటెడ్ కేంద్రాలలో ఆన్లైన్ కామన్ ఎంట్రెన్స్ పరీక్షను వారు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రక్రియలో మార్పుకు సంబంధించిన ప్రకటనలను సైన్యం వివిధ వార్తాపత్రికలలో ప్రకటన ద్వారా వెల్లడించింది. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
కాగా ఇప్పటివరకు అనుసరించిన విధానం ప్రకారం.. అగ్నివీర్ల రిక్రూట్మెంట్ ప్రక్రియలో అభ్యర్థులు మొదట ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. చివరి దశగా సీఈఈ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం మార్చిన నిబంధనలు అనుసరించి సీఈఈ పరీక్ష ముందుగా రాయాల్సి ఉంటుంది. అందులో అర్హత సాధించిన తర్వాతే ఫిజికల్ ఫిట్నెస్ మరియు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 19,000 మంది అగ్నివీరులు ఆర్మీలో చేరగా, మార్చి మొదటి వారం నుంచి మరో 21,000 మంది సైన్యంలో చేరనున్నారు. 2023-24 తదుపరి రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా ఆర్మీలో చేరడానికి సిద్ధంగా ఉన్న దాదాపు 40,000 మంది అభ్యర్థులకు ఈ కొత్త రిక్రూట్మెంట్ నియమాలు వర్తిస్తాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE