తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మరికాసేపట్లో రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈరోజు (ఫిబ్రవరి 5, ఆదివారం) ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినెట్ సమావేశం సందర్భంగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ 2023-24 పై కేబినెట్ కీలకంగా చర్చించి, ఆమోదం తెలుపనుంది. ఇక కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ పలువురు నేతలతో కలిసి నాందేడ్ కు వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం నాందేడ్ లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రెండవ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మరోవైపు 2023-24 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఫిబ్రవరి 6, సోమవారం నాడు శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ.హరీశ్ రావు శాసనసభలో, రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 7వ తేదీన అసెంబ్లీకి సెలవు ప్రకటించగా, 8వ తేదీన ఉభయసభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. అలాగే 9,10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చిస్తారు. ఇక ఫిబ్రవరి 12వ తేదీన ద్రవ్య వినిమయబిల్లుపై చర్చ జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE