ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ అధిపతి ఎలోన్ మస్క్కు యూజర్లు గట్టి షాక్ ఇచ్చారు. ట్విట్టర్ సీఈఓగా ఆయన వైదొలగాలని అత్యధికులు కోరుకున్నారు. ఈ మేరకు ఎలోన్ మస్క్.. తాను ‘ట్విట్టర్ సీఈఓగా కొనసాగాలా? లేక తప్పుకోవాలా?’ అంటూ ఆదివారం సాయంత్రం ఆన్లైన్ పోల్ నిర్వహించగా దీనిలో పాల్గొన్న చాలా మంది వినియోగదారులు అతనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ట్విట్టర్ అధినేతగా ఎలోన్ మస్క్ వైదొలగాలని కోరుతూ దాదాపు 57.5 శాతం ఓట్లు పోలవగా, కొనసాగాలంటూ 42.5 శాతం మంది కోరుకున్నారు. కాగా మొత్తం 17.5 మిలియన్లకు పైగా ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. అయితే ఫలితం ఎలా వచ్చినా పోల్ ఫలితాలకు కట్టుబడి ఉంటానని మస్క్ తొలుతే స్పష్టం చేసిన మస్క్.. అయితే తాను ఎప్పుడు పదవి నుంచి వైదొలుగుతాననే వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో తాజా ఫలితాలపై ఆయన నిర్ణయం ఎలా ఉండనుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కాగా ట్విట్టర్ సొంతం చేసుకున్నప్పటినుండీ ఎలోన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా సంస్థలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ‘సంస్థలో కొనసాగాలంటే ఎక్కువ గంటలు పని చేయాల్సిందేనని’ మస్క్ అల్టిమేటం జారీ చేయడంతో.. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది ఉద్యోగులు కంపెనీని వీడుతూ సామూహికంగా రాజీనామాలు చేయడం సంచలనం సృష్టించింది. దీంతో ఒక సమయంలో కొన్ని రోజుల పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ట్విట్టర్ కార్యాలయాలు మూసివేశారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ప్రీ మార్కెట్ ట్రేడింగ్లో టెస్లా ఇంక్, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ మస్క్ హెడ్స్ షేర్లు 5 శాతానికి పైగా పెరగడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE