గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన అమర్నాథ్ యాత్ర నేటినుంచి ప్రారంభమయింది. 2,750 మంది యాత్రికులతో మొదటి బ్యాచ్ బయలుదేరింది. హిమగిరుల్లో కొలువైన మహాదేవుడి దర్శనం కోసం జమ్ము నుంచి కశ్మీర్లోని పహల్గామ్, బాల్తల్ బేస్ క్యాంపులకు యాత్రికులు బయలుదేరారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ పీయూష్ సింగ్లా బేస్ క్యాంపు నుంచి పాదయాత్రను ఆరంభించారు. వీరి యాత్రను జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ‘రక్షాబంధన్’ రోజు (ఆగస్టు 11)న ముగియనుంది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు.
श्री अमरनाथ यात्रा सनातन संस्कृति की गौरवशाली परंपरा की प्रतीक है।
इस पवित्र यात्रा पर बाबा बर्फानी के दर्शन के लिये जाने वाले सभी श्रद्धालुओं को शुभकामनाएँ देता हूँ और उनकी सुगम व मंगलमय यात्रा की कामना करता हूँ।
हर हर महादेव।
— Amit Shah (@AmitShah) June 30, 2022
ఈ యాత్రను భారతీయ సనాతన సంస్కృతి యొక్క అద్భుతమైన సంప్రదాయానికి చిహ్నంగా అమిత్ షా పేర్కొన్నారు. ఆ దేవదేవుని దర్శనం కోసం వెళ్తున్న భక్తులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి ప్రయాణం సాఫీగా మరియు సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్” అని ట్విట్టర్లో తెలిపారు. ఇక యాత్రికులు సజావుగా సాగేందుకు మరియు వారు క్షేమంగా మరియు శాంతియుతంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేశామని పీయూష్ సింగ్లా చెప్పారు. దీనికోసం బిఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఐటీబీపీ భద్రతా బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ