దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. మరోసారి కొత్త కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,819 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,34,52,164 కు చేరుకుంది. కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళలో 4459, మహారాష్ట్రలో 3957 నమోదయ్యాయి. అలాగే కరోనాతో మరో 39 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,25,116 కు పెరిగింది. మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య లక్ష (1,04,555 – 0.24%) దాటింది. మరో 13,827 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,28,22,493 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.55 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూన్ 30, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 86,23,75,489
- జూన్ 29న నిర్వహించిన కరోనా పరీక్షలు : 4,52,430
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,34,52,164
- కొత్తగా నమోదైన కేసులు [జూన్ 29–జూన్ 30 (8AM-8AM)] : 18,819
- నమోదైన మరణాలు : 39
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,28,22,493
- యాక్టీవ్ కేసులు : 1,04,555
- మొత్తం మరణాల సంఖ్య : 5,25,116
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY