కోవిడ్-19 మహమ్మారి చికిత్సలో మరో కీలక ముందడుగు పడింది. కరోనాపై పోరాటం, నివారణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్స్ ఇప్పటికే అందుబాటులోకి రాగా, తాజాగా కరోనా చికిత్సలో భాగంగా అగ్రరాజ్యం అమెరికా తొలిసారిగా ఓ టాబ్లెట్ (పిల్)కు ఆమోదం తెలిపింది. కరోనా చికిత్సలో భాగంగా అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ అభివృద్ది చేసిన “పాక్స్లోవిడ్” టాబ్లెట్ అత్యవసర వినియోగానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) బుధవారం నాడు ఆమోదం తెలిపింది. ఈ యాంటీ-కోవిడ్ టాబ్లెట్ ను కరోనా బారిన పడి రిస్క్ ఎక్కువుగా కలిగిఉన్న 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు ఇంట్లోనే చికిత్స పొందుతూ తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు . క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కరోనా బారినపడి ప్రమాదంలో ఉన్నవారిలో ఆసుపత్రిలో చేరడం, మరణాల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ టాబ్లెట్ 88 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్టు తేలిందన్నారు.
పాక్స్లోవిడ్ టాబ్లెట్ కు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం తెలపడంపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ, “కోవిడ్-19పై చేస్తున్న పోరాటంలో ఈరోజు మాకు శుభవార్త అందింది. ఎఫ్డీఏ ఫైజర్ యాంటివైరల్ టాబ్లెట్ యొక్క అత్యవసర వినియోగ అధికారాన్ని మంజూరు చేసింది, ఇది ఒక ఆశాజనకమైన కొత్త చికిత్స ఎంపిక. ప్రస్తుతం మనం మరింత వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్తో పోరాడుతున్నప్పుడు ఈ టాబ్లెట్ ఆసుపత్రిలో చేరడం మరియు మరణాలను గణనీయంగా తగ్గిస్తుంది” అని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ