ప్రముఖ ఇస్లాం దేశం సౌదీ అరేబియా భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. ఆదివారం నుంచి ఇది అమలులోకి వస్తుందని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఒమిక్రాన్ యొక్క ఉప-వేరియంట్ల కారణంగా తమ దేశంలో మళ్ళీ కోవిడ్-19 వ్యాపిస్తున్నందున సౌదీ అరేబియా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. సౌదీ అరేబియా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఈ 16 దేశాలు కాకుండా, ఇతర దేశాలకు వెళ్లాలనుకునే సౌదీ పౌరులు తప్పనిసరిగా ఆరు నెలల కంటే ఎక్కువ పాస్పోర్ట్ కలిగి ఉండాలని సూచించింది. సౌదీ గెజిట్ ప్రకారం, అరబ్ దేశాలకు ప్రయాణానికి, పాస్పోర్ట్కు కనీసం మూడు నెలల చెల్లుబాటు ఉండాలి. ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాలకు వెళ్లే పౌరులు తప్పనిసరిగా కనీసం మూడు నెలలపాటు చెల్లుబాటు అయ్యే జాతీయ గుర్తింపు కార్డును కలిగి ఉండాలని కూడా ప్రకటించింది. ప్రయాణం కోసం, అసలు ఐడి కార్డ్ మరియు కుటుంబ రిజిస్ట్రీ తప్పనిసరి అని తెలిపింది. కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలోనే ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు, మంకీ పాక్స్ వైరస్ భయం వలన కాదని స్పష్టం చేసింది ప్రభుత్వం.
సౌదీ అరేబియా ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాలు
- ఇండియా
- లెబనాన్
- సిరియా
- టర్కీ
- ఇరాన్
- ఆఫ్ఘనిస్తాన్
- యెమెన్
- సోమాలియా
- ఇథియోపియా
- కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్
- లిబియా
- ఇండోనేషియా
- వియత్నాం
- ఆర్మేనియా
- బెలారస్
- వెనిజులా
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ