ఆగస్టు 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు, స్మారక చిహ్నాలు/పురావస్తు ప్రదేశాలను ప్రజలు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ప్రకటించింది. దేశంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్న ప్రదేశాలు, మ్యూజియాల్లో ఆగస్టు 5 నుంచి 15 వరకు ఎటువంటి రుసుము వసూలు చేయరాదని ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఆదేశాలు ఇచ్చారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. చారిత్రక ప్రదేశాలను సందర్శించే సందర్శకులు మరియు పర్యాటకులకు కూడా ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY