“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో రోజున మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ రోజు వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి తీసుకోబోయే 11 రకాల చర్యలు, కేటాయింపుల వివరాలను తెలియజేశారు. అలాగే మత్స్య శాఖ, పశు సంవర్ధక శాఖ విభాగాల కేటాయింపులను వివరించారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ గ్రీన్ కిందకు అన్ని కూరగాయలు, పండ్లు, ఉల్లిపాయలు సరఫరాను తీసుకొస్తామని చెప్పారు. రవాణా ఖర్చుల్లో 50 శాతం, శీతల గోదాముల బిల్లులో 50 శాతం రాయితీ ఇస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మేరకు వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు.
నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
వ్యవసాయం:
- లాక్డౌన్ సమయంలో కనీస మద్దతు ధరతో రూ.74,300 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు జరిగాయి.
- పీఎం-కిసాన్ కింద రైతులకు రూ.18,700 కోట్లు బదిలీ.
- పీఎం ఫసల్ బీమా యోజన కింద రూ.6,400 కోట్లు విడుదల.
- ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతుల ఉత్పత్తుల సంఘాలు, ఇతర సంస్థలు, కోల్డ్ స్టోరేజీస్, పంట కోత, స్టార్టప్ల కోసం, మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకోవడానికి రూ.1 లక్ష కోట్లు కేటాయింపు.
- సూక్ష్మ ఆహార సంస్థలకు రూ.10,000 కోట్ల రూపాయల నిధులు.
- స్థానికంగా తయారైన ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లకు చేరుకోవడానికి మద్దతు. స్థానిక ఆహార ఉత్పత్తులు ఆధారంగా క్లస్టర్స్ ఏర్పాటు చేయడం ద్వారా 2 లక్షల సంస్థలకు ప్రయోజనం.
లాక్డౌన్ సమయంలో పశుసంవర్ధకం:
- లాక్డౌన్ కారణంగా మిల్క్ డిమాండ్ 20-25 శాతం తగ్గింది.
- మిగులు పాలను సహకార డైరీల ద్వారా సేకరించి, రూ.4100 కోట్ల మేర పాడి పరిశ్రమ రైతులకు మేలు చేకూర్చాం.
- పాడి సహకార సంస్థలకు సహాయంగా 2020-21 సంవత్సరానికి గానూ 2% వడ్డీ సమీకరణ కోసం కొత్త పథకం.
- సరైన సమయానికి చెల్లించే వారికీ అదనపు 2% వడ్డీ ఉపసంహరణ, ఈ పథకం ద్వారా రూ.5000 వేల కోట్ల అదనపు లిక్విడిటీతో 2 కోట్ల రైతులకు లబ్ది చేకూరుతుంది.
మత్స్య కారులు:
- మత్స్య సంపద యోజన కింద రూ.20,000 కోట్ల నిధి.
- ఈ రంగంలో 55 లక్షల మందికి ఉపాధి కల్పన.
- మత్స్యకారులకు, వ్యక్తిగత పడవలకు బీమా సదుపాయం.
పాడిపరిశ్రమ రంగం:
- రూ .15 వేల కోట్లతో పశుసంవర్ధక మౌలిక సదుపాయాల నిధి.
- ఈ రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తాం.
- సుమారు 53 కోట్ల పశువులకు వంద శాతం వ్యాక్సిన్. పశువుల మూతి, కాళ్లకు వచ్చే వ్యాధి నివారణకు టీకా కార్యక్రమం.
ఔషధ పంటలు సాగు:
- ఔషధ పంటల కోసం రూ.4 వేల కోట్లు కేటాయింపు.
- రానున్న ఐదేళ్లలో ఔషధ పంటల సాగును 10 లక్షల హెక్టార్లకు పెంచడమే లక్ష్యం.
- రైతులకు రూ .5 వేల కోట్ల ఆదాయాన్ని సమకురుతుందని అంచనా.
- తేనే తీగల సంరక్షణకు రూ.500 కోట్లు కేటాయింపు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu