భారత్ లో కోవిడ్ -19(కరోనా వైరస్) సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు భారీ సాయం ప్రకటించింది. సామాజిక భద్రతా ప్యాకేజి కింద ప్రపంచ బ్యాంకు భారత్ కు ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ.7500 కోట్లు) భారీ సహాయాన్ని ప్రకటించింది. దేశంలో అమలవుతున్న సామాజిక భద్రతా పథకాలతో ఈ ప్యాకేజి ముడిపడి ఉంటుందని, ఆ నిమిత్తం ఈ నిధులను వినియోగించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. గతంలో ప్రపంచ బ్యాంకు భారత్ కు కేటాయించిన 1 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అదనంగా ఈ ప్యాకేజి ఉంటుందని చెప్పారు. మరోవైపు కరోనా వలన దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న క్రమంలో “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి ప్రశంసలు లభించాయి.
ప్రపంచ బ్యాంక్ ఇండియా డైరెక్టర్ జునైద్ అహ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేద మరియు బలహీన వర్గాలకు సహాయం అందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా సహాయాన్ని ప్రకటిస్తునట్టు తెలిపారు. ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ ఈ పరిస్థితుల్లో చాలా ముఖ్యమైనదని, కోవిడ్ -19 తీవ్ర ప్రభావం తర్వాత భారతదేశం ప్రజల ఆరోగ్యానికి మరియు జీవనోపాధి మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపకుండా సమాన ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu