మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగబాద్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. జల్నా నుండి ఔరంగబాద్ మధ్య తిరిగే గూడ్స్ రైలు, ట్రాక్ పై నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లడంతో 14 మంది మరణించినట్టు అధికారులు దృవీకరించారు. ఆర్పీఎఫ్, రైల్వే ఉన్నతాధికారులు, పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారు జాము కావడంతో కూలీలు గూడ్స్రైలును రాకను గమనించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
మహారాష్ట్రలోని ఔరంగబాద్లో జరిగిన రైలు ప్రమాదం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో ప్రమాదంపై చర్చించానని, అతను పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అవసరమైన అన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.
Extremely anguished by the loss of lives due to the rail accident in Aurangabad, Maharashtra. Have spoken to Railway Minister Shri Piyush Goyal and he is closely monitoring the situation. All possible assistance required is being provided.
— Narendra Modi (@narendramodi) May 8, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu