భారత్ లో కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావంతో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3390 కరోనా పాజిటివ్ కేసులు, 103 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ 2000 వేలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. మే 8, శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 56,342 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,886 కి చేరింది. మరోవైపు కరోనా బాధితుల్లో 16,540 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 37,916 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక మధ్యలో తగ్గుముఖం పట్టి మళ్ళీ ఒక్కసారిగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళనకరంగా మారింది.
ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే 17,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 1200 కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 3301 మంది కోలుకోగా, 694 మంది మరణించారు. పాజిటివ్ కేసులతో పాటుగా కరోనా మరణాలు సైతం మహారాష్ట్రలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర తర్వాత గుజరాత్ లో అత్యధికంగా 7013, ఢిల్లీలో 5980 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 17,974
- గుజరాత్ – 7013
- ఢిల్లీ – 5980
- తమిళనాడు – 5,409
- రాజస్థాన్ – 3,543
- మధ్యప్రదేశ్ – 3,252
- ఉత్తర ప్రదేశ్ – 3,071
- ఆంధ్రప్రదేశ్ – 1,833
- పంజాబ్ – 1,644
- పశ్చిమబెంగాల్ – 1,548
- తెలంగాణ – 1,122
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu