ప్రేమ కోసం అప్పుడు సీమా, ఇప్పుడు సానియా.. కాకపోతే క్లైమాక్సే తేడా

Bangladeshi Woman Sania Akhtar Reaches India With Kid Claims Noida Man Married and Deserted Her,Bangladeshi Woman Sania Akhtar,Sania Akhtar Reaches India With Kid,Noida Man Married and Deserted Her,Sania Akhtar Claims Noida Man Married,Mango News,Mango News Telugu,Seema Hyder, India from Pakistan, woman from Bangladesh, came to India, Sania Akhtar,Bangladeshi Woman Latest News,Bangladeshi Woman Latest Updates,Sania Akhtar Latest News and Updates

ప్రేమ కోసం ఖండాంతరాలను దాటి.. దేశ సరిహద్దులను కూడా లెక్కచేయకుండా భారత్ వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది.మొన్నటికి మొన్న పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు తరలివచ్చిన సీమా హైదర్‌ లవ్ స్టోరీ మరచిపోకముందే అలాంటి ఎన్నో ప్రేమ కథలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన మరో మహిళ ఏకంగా తన ఏడాది కుమారునితో పాటు భారత్‌కు వచ్చేసింది. ఇలా భారత్ వచ్చిన మహిళ పేరు సానియా అఖ్తర్‌ అని పోలీసులు చెబుతున్నారు.

సానియా అఖ్తర్ బంగ్లాదేశ్‌ నుంచి వీసా తీసుకుని మరీ.. తన ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సౌరభ్‌ కాంత్‌ తివారిని కలుసుకునేందుకు వచ్చినట్లు పోలీసుల ముందు సానియా చెబుతోంది. బంగ్లాదేశ్‌లో సౌరభ్ ఉన్నప్పుడు.. సానియా, సౌరభ్‌లు మూడేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకోగా.. తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారికి ఇప్పుడు ఏడాది వయసు. ఇప్పుడు సానియా తన కుమారుడిని తీసుకుని, తన భర్త ఉంటున్న నోయిడాకు వచ్చింది. పాపం ఇక్కడే సానియాకు షాకింగ్ న్యూస్ తెలిసింది. ఆమె ఇక్కడకు వచ్చాక భర్త మరో వివాహం చేసుకున్నాడని తెలియడంతో కంగుతిన్నాది.

అంతేకాదు తన భర్త తనను, తన కుమారుడిని చేరదీయలేదని.. చిన్న పిల్లాడు అని కూడా చూడలేదని.. కనీసం తనకు ఇప్పుడు ఆశ్రయం కల్పించడం లేదని సానియా ఆరోపిస్తుంది. తనను మోసం చేసిన సౌరభ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని మీడియా ముందుకు వచ్చింది. దీంతో ఈ స్టోరీ మొత్తం నోయిడా పోలీసుల వరకూ చేరింది. చివరకు ఆమె స్థానికుల చొరవతో ఆమె తన ఏడాది వయసున్న కొడుకుతో సహా సెక్టార్‌ 108లో ఉన్న పోలీస్‌ కమిషనరేట్‌కు చేరుకుంది.

తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను సానియా వేడుకోవడంతో..పోలీసులు ఆమెకు భరోసా ఇచ్చారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. సౌరభ్‌ బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కల్టీ మ్యాక్స్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో చాన్నాళ్లు పనిచేసాడు. అదే సమయంలో సానియాతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నాడు. సంతోషంగా ఉన్న సమయంలో భారత్ కు వచ్చిన సౌరభ్ తిరిగి బంగ్లాదేశ్ కు వెళ్లలేదు. దీంతో సానియానే భారత్ కు వచ్చి సౌరబ్ గురించి ఎంక్వైరీ చేయడంతో మరో పెళ్లి విషయం బయటకు వచ్చింది. చివరకు సానియా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 2 =