భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్, జూలై 29, ఆగస్టు 1,2,6,7 తేదీల్లో 5 టీ20ల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు మ్యాచుల వన్డే సిరీస్ కోసం ఇప్పటికే భారత్ జట్టును ప్రకటించగా, తాజాగా టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించారు. టీ20ల కోసం 18 మందితో కూడిన భారత్ జట్టును ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ గురువారం నాడు ప్రకటించింది. ఈ సిరీస్ కు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, చాహల్ లకు విశ్రాంతి కల్పించారు. కుల్దీప్ యాదవ్, అశ్విన్ రవిచంద్రన్ తిరిగి టీ20 జట్టులో చోటు సంపాదించారు. కాగా కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ లను జట్టులో చేర్చుకోవడం ఫిట్నెస్కు లోబడి ఉంటుందని పేర్కొన్నారు.
వెస్టిండీస్ తో 5 టీ20లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY