భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ఇప్పటికి 1-1తో సమమైన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్ట్ జనవరి 7 నుంచి సిడ్నీ స్టేడియంలో ప్రారంభం కానుంది. తోలి టెస్టులో ఓటమి తర్వాత రెండో టెస్టులో పుంజుకుని ఘన విజయం సాధించిన భారత్ జట్టు మూడో టెస్టులో కూడా సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్లో ఆడబోయే తుది భారత్ జట్టును బుధవారం నాడు బీసీసీఐ ప్రకటించింది.
గత రెండు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించని ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఈ జాబితాలో చోటు కోల్పోయాడు. అతని స్థానంలో క్వారంటైన్ ముగించుకుని ఇటీవలే జట్టులో చేరిన వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మూడో టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. అలాగే గాయం కారణంగా జట్టుకు దూరమైన ఉమేష్ యాదవ్ స్థానంలో నవదీప్ సైనీ టెస్టుల్లో అరంగ్రేట్రం చేస్తున్నాడు.
ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్లో ఆడబోయే భారత్ జట్టు ఇదే:
- శుభ్ మన్ గిల్
- రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్)
- చటేశ్వర్ పుజారా
- అజింక్య రహానే (కెప్టెన్)
- హనుమ విహారి
- రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
- రవీంద్ర జడేజా
- రవిచంద్రన్ అశ్విన్
- జస్ప్రీత్ బుమ్రా
- మహమ్మద్ సిరాజ్
- నవదీప్ సైనీ
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ