కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనాబారిన పడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ గా తేలడంతో చికిత్స నిమిత్తం సోమవారం నాడు ఆయన ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) ట్రామా సెంటర్ లో చేరారు. మరోవైపు దేశంలో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ వేగవంతానికి సంబంధించి పలు సూచనలతో ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం నాడు మన్మోహన్ సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ