ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ప్రారంభానికి బీసీసీఐ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021 (14వ సీజన్) షెడ్యూల్ను బీసీసీఐ ఆదివారం నాడు విడుదల చేసింది. ఏప్రిల్ 9న తోలి మ్యాచ్ తో ఈ సీజన్ ప్రారంభమవనుండగా, మే 30న ఫైనల్ జరగనుంది. ఏప్రిల్ 9 న 2020 ఐపీఎల్ విజేత ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ తో క్రీడాభిమానులకు అత్యంత ఇష్టమైన ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచులు రాత్రి 7.30 గంటలకు, మరియు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్నాయి.
కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్-2021 మ్యాచులను బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, కోల్కతా వంటి నగరాల్లోనే నిర్వహించనున్నారు. హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్ లలో మ్యాచులు నిర్వహించడం లేదు. ఈసారి ఏ జట్టుకు కూడా సొంత మైదానంలో మ్యాచ్ లు ఆడే అవకాశం ఇవ్వలేదు. అలాగే ఈ ఐపీఎల్ తొలి దశ మ్యాచ్లకు ప్రేక్షకులకు అనుమతి లేదు. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచులకు ప్రేక్షకులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటీవలే ప్రారంభమైన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే ఐపీఎల్ యొక్క 8 లీగ్ మ్యాచులు, ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి.
#VIVOIPL is back in India 🇮🇳 🙌
Time to circle your favorite matches on the calendar 🗓️
Which clashes are you looking forward to the most? 🤔 pic.twitter.com/kp0uG0r9qz
— IndianPremierLeague (@IPL) March 7, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ