భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురవడంతో మే 10, ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆల్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో చేరారు. ఛాతీ నొప్పి మరియు అసౌకర్యానికి గురవడంతోనే ఆయనను ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీష్ నాయక్ పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో, దేశవ్యాప్తంగా అనేక మంది నాయకులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu