భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం గురువారం నాడు అహ్మదాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్–2022 సీజన్ నుంచి టోర్నీలో పాల్గొనేందుకు 10 టీమ్స్ కు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 8 టీమ్స్ తో పాటుగా అదనంగా మరో రెండు టీమ్ లను చేర్చనున్నారు. ముందుగా 2021 సీజన్ లోనే 10 టీమ్స్ ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ, 2021 సీజన్ కు నాలుగు నెలల కన్నా తక్కువ సమయమే ఉండడంతో ప్రస్తుతానికి ఎనిమిది టీమ్స్ తోనే కొనసాగించాలని నిర్ణయించారు.
అలాగే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ చేర్చడంపై కూడా కీలకంగా చర్చించారు. ఇక బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు ఐసీసీ టోర్నీల నిర్వహణకు సంబంధించి పన్ను రాయితీల విషయంలో ప్రభుత్వంతో చర్చించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, రాజీవ్ శుక్లా ఇతర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ