టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరో కీలక పదవి చేపట్టనున్నాడు. సౌరవ్ గంగూలీని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్ కమిటీ ఛైర్మన్గా నియమించినట్లు ఐసీసీ గవర్నింగ్ బాడీ బుధవారం నాడు వెల్లడించింది. ఇప్పటి వరకు ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా ఉన్న టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియనుండటంతో తాజాగా ఆ పదవిలో గంగూలీని నియమిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు సౌరవ్ గంగూలీని స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నానని అని చైర్మన్ గ్రెగ్ బార్క్లే తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరిగా మరియు అడ్మినిస్ట్రేటర్గా గంగూలీ అనుభవం క్రికెట్ నిర్ణయాలను రూపొందించడంలో మాకు సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ