మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని, కొంతమంది తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా వ్యాఖ్యలు చేశారు. కాగా సోమవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్న సందర్భంగా మంత్రి కొడాలి నాని ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్ళానని, రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తుందన్నారు. వంగవీటి రాధాకి సెక్యూరిటీ పెంపుపై సీఎం ఆదేశాలు ఇచ్చారని, ఇకపై ఆయనకు 2+2 గన్ మెన్ లను కేటాయించమని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిపారు. మరోవైపు రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీని సీఎం ఆదేశించారని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఇక వంగవీటి రాధాతో రాజకీయాల గురించి మాట్లాడలేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ