పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సెకండ్ సెషన్ సోమవారం నుంచి ప్రారంభం అయినా విషయం తెలిసిందే. ఈరోజు (మంగళవారం) బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ఎంపీలు హాజరయ్యారు. ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన విషయం విదితమే. యుపి, ఉత్తరాఖండ్, మణిపూర్ మరియు గోవా ఎన్నికలను గెలుచుకుని ఆయా రాష్ట్రాలలో తిరిగి అధికారం చేపట్టబోతున్న దరిమిలా పార్టీనేతలు ప్రధాని మోదీని సన్మానించారు. ఈ సమావేశంలో మోదీ, నడ్డాలకు బీజేపీ ఎంపీల నుంచి స్టాండింగ్ ఒవేషన్ కూడా లభించింది. సన్మానం సందర్భంగా ముందుగా నడ్డాకు పూలమాల వేయమని ప్రధాని సైగ చేయటం విశేషం.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పార్టీలో కుటుంబ రాజకీయాలు అనుమతించబడవని, అలాగే, ఇతర పార్టీలలోని వంశ రాజకీయాలను కూడా ఎదుర్కోవాలని బిజెపి ఎంపిలకు పిలుపునిచ్చారు. మన పార్టీలో ఎంపీల వారసుల టికెట్ల నిరాకరణకు పూర్తి బాధ్యత వహిస్తానని ప్రధానమంత్రి తెలిపారు. యోగి ఆదిత్యనాథ్ 37 సంవత్సరాల తర్వాత యుపిలో వరుసగా గెలిచిన మొదటి ముఖ్యమంత్రి అయ్యారు, మణిపూర్లో ఒంటరి విజయం, ఉత్తరాఖండ్లో మొదటి పునరావృత ప్రభుత్వం మరియు గోవాలో పనితీరు.. మొదలైనవి నడ్డా నాయకత్వంలో పార్టీ యొక్క మొదటి ప్రధాన విజయాలుగా ప్రధాని అభివర్ణించారు. బీజేపీ పార్లమెంటరీ ప్యానెల్ సమావేశానికి హాజరైన ఎంపీలు కూడా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. యుక్రెయిన్లో షెల్లింగ్లో మరణించిన నాల్గవ సంవత్సరం వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మరియు కర్నాటకలో హిజాబ్ రోజ్ మధ్య మరణించిన బజరంగ్ దళ్ కార్యకర్త హర్షకు కూడా నివాళులర్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ