ఎయిర్ ఇండియా ఛైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన టాటా సన్స్ సంస్థ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు నిర్వహించిన ఎయిర్ ఇండియా బోర్డు సమావేశంలో ఛైర్మన్గా చంద్రశేఖరన్ నియామకానికి ఆమోదం తెలిపారు. ఇటీవలే టాటా గ్రూప్ బిడ్ గెలుచుకుని ఎయిర్ ఇండియాను ప్రభుత్వం నుంచి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్మన్ నియామకంతో పాటుగా జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాజీ సీఎండీ అలిస్ గీవర్గీస్ వైద్యన్, హిందుస్థాన్ యూనిలీవర్ ఛైర్మన్ సంజీవ్ మెహతాను కూడా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ లుగా నియమించారు.
ఇక ఎయిర్ ఇండియాకు కొత్త సీఈవోను కూడా త్వరలోనే నియమించనున్నట్టు తెలుస్తుంది. ముందుగా టర్కీ ఎయిర్లైన్స్ మాజీ సీఈవో ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియాకు సీఈవోగా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలుపగా, అధికారికంగా బాధ్యతలు చేపట్టకముందే ఆ పదవీ స్వీకరించేందుకు నిరాకరిస్తునట్టు ఇల్కర్ ఐసీ ప్రకటించారు. ఈ నియామకం వివాదాస్పదం కావడంతో తాజాగా కొత్త సీఈవో కోసం టాటా గ్రూప్ కీలక సంప్రదింపులు జరుపుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ