ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా మరియు ఆ పార్టీ ఎంపి మనోజ్ తివారీ విడుదల చేశారు. అంతకుముందు బుధవారం, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఎన్నికలపై దేశ రాజధానిలోని తన నివాసంలో ఢిల్లీ బిజెపి కోర్ గ్రూప్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అలాగే ఎంసీడీ పోల్ మేనేజ్మెంట్ కమిటీ హెడ్ ఆశిష్ సూద్ ఢిల్లీ బిజెపి తన ‘వచన్ పత్ర’ కింద మురికివాడల నివాసితులకు ఇళ్లు ఇస్తామని హామీ ఇస్తూ నిబద్ధత లేఖను విడుదల చేశారు.
మేనిఫెస్టో ప్రకారం.. ఢిల్లీలోని అన్ని మురికివాడల నివాసితులకు పక్కా ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇంకా రాజధానిలో చెత్తను సక్రమంగా పారవేసేలా చూస్తామని హామీ ఇచ్చింది. దేశ రాజధానిలో పౌర సౌకర్యాల మెరుగుదల, ప్రభుత్వ శాఖల్లో అవినీతికి చెక్ పెట్టడం వంటి హామీలను పొందుపరిచింది. కాగా గత నెలలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్లో భాగంగా దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన 3,024 ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లను ప్రారంభించి భూమిహీన్ క్యాంపులో మురికివాడల నివాసితులకు అందజేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలో ఎంసీడీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE