ఇప్పుడు ఎవరినీ చూసినా చేతిలో స్మార్ట్ ఫోన్తోనే కనిపిస్తున్నారు. అరక్షణం ఖాళీ ఉన్నా..అందులోనే గడిపేస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో మునిగితేలుతూ బిజీగా మారిపోతున్నారు. ఇలా సోషల్ మీడియా ప్రభావం అందరిలో ఓ రేంజ్లో పడిపోయింది. గంటలు గంటలు ఇంటర్నెట్లోనే మునిగితేలుతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా రీల్స్ చేస్తూ, పోస్టులు, ఫోటోలు పెడుతూ ఫాలోవర్స్ను తెగ పెంచేసుకుంటున్నారు.ఇక సెలబ్రెటీలు అయితే వీటితోనే భారీగా అంటే కూడా సింపుల్ అయిపోతుందేమో అన్న రేంజ్లో సంపాదిస్తున్నారు.
నిజానికి ఇన్ స్టా రీల్స్, వీడియోలతో సామాన్యులు సెలబ్రెటీలుగా మారిపోయి వేలు, లక్షలు సంపాదిస్తుంటే..సెలబ్రెటీస్ అయితే ఊహకు కూడా అందనంత ఎక్కువగా రాబడి పొందుతున్నారు. క్రికెటర్స్ నుంచి హీరో, హీరోయిన్స్ వరకూ సోషల్ మీడియా ద్వారా భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నారు. తమ అప్డేట్స్, వ్యక్తిగత విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ వాళ్లకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే.. ఎన్నో బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోసం కూడా తమ ఇన్ స్టా అకౌంట్లను ఉపయోగిస్తున్నారు. ఇన్స్టాలో ఫాలోయింగ్ను బట్టి ఓ రేంజ్లో ఆర్జిస్తున్నారు.
అయితే అలాగే ఇన్స్టాలో ఒక్క పోస్ట్ చేసినందుకు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఏకంగా రూ.3 కోట్లు ఆర్జిస్తుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏకంగా టాప్లో ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ను కూడా వెనక్కు నెట్టి మరీ.. పెద్ద మొత్తంలో రాబడుతుందన్న వార్త ఇప్పుడు వైరల్గా మారింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రియాంక చోప్రాకు బీభత్సమైన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉన్నారు. ప్రియాంకకు ఇన్ స్టాలో 89.4 మిలయన్ ఫాలోవర్స్ ఉన్నారంటేనే ఆమెకున్న క్రేజును అర్ధం చేసుకోవచ్చు. అయితే ప్రియాంక తన ఇన్ స్టా ద్వారా ఒక్కో యాడ్ పోస్ట్ కు రూ.3 కోట్లు సంపాదిస్తుందన్న న్యూస్తో బాలీవుడ్ కూడా షాకవుతోంది.
అయితే కింగ్ షారుఖ్ ఖాన్ మాత్రం ఒక్కో యాడ్ పోస్ట్ కు రూ.80 లక్షల నుంచి కోటి వరకే అందుకుంటున్నారు. షారుఖ్ ఖాన్కు ఇన్స్టాగ్రామ్లో 42.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ప్రియాంక తర్వాత అలియా భట్ ఒక్కో పోస్ట్ కు రూ.కోటి అందుకోగా…. శ్రద్ధా కపూర్ రూ.1.18 కోట్లు.. దీపికా పదుకొణే.. రూ. 1.5 కోట్లు సంపాదిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE